తండ్రి మృతి.. వేరే పెళ్లి చేసుకున్న తల్లి.. అయిదేళ్ల ఆ కూతురి జీవితం చివరకు ఎలా ముగిసిందంటే..

ABN , First Publish Date - 2022-04-11T22:21:51+05:30 IST

ఐదేళ్ల వయసులోనే ఆమె తన తండ్రిని కోల్పోయింది. తల్లి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటరైంది. మేనమామల ఇంట్లో

తండ్రి మృతి.. వేరే పెళ్లి చేసుకున్న తల్లి.. అయిదేళ్ల ఆ కూతురి జీవితం చివరకు ఎలా ముగిసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఐదేళ్ల వయసులోనే ఆమె తన తండ్రిని కోల్పోయింది. తల్లి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటరైంది. మేనమామల ఇంట్లో పెరిగి పెద్దైంది. చివరికి ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఆ యువతి పేరు ఉమ. ఐదేళ్ల వయసులోనే ఆమె తన తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకే తల్లి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లి పోవడంతో ఆమె ఒంటరైంది. దీంతో రమేశ్ చంద్ర, చంద్రశేఖర్ అనే మేనమామలు ఆమెను చేరదీశారు. ఈ క్రమంలో పెరిగి పెద్దైన ఆమెకు ప్రస్తుతం 23ఏళ్లు. ఉమ రెండేళ్ల క్రితం సోను అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అనంతరం అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భర్తకు దూరంమైన ఆమె.. మేనమామలు నివసిస్తున్న గ్రామానికి తిరిగొచ్చింది.



ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రెండు నెలలుగా ఒంటరిగా జీవిస్తోంది. అయితే అనూహ్యంగా ఆదివారం ఆమె విగత జీవిగా కనిపించింది. ఉమను పలకరించేందుకు రమేశ్ చంద్ర ఇంటికి వెళ్లగా.. ఆమె మృతదేహం రక్తపు మడుగులో ఉంది. ఆ దృశ్యాలు చూసి షాకైన అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందిచాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి చంద్రశేఖర్ కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వ్యక్తం చేసిన రమేశ్ చంద్ర.. చంద్రశేఖర్‌పై అలాగే ఉమ భర్త సోనూపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-04-11T22:21:51+05:30 IST