విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

ABN , First Publish Date - 2021-02-28T05:27:15+05:30 IST

విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని కుకునూరులో శుక్రవారం రాత్రి జరిగింది.

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

వెల్దుర్తి ఫిబ్రవరి 27:  విద్యుదాఘాతంతో  ఓ యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని కుకునూరులో శుక్రవారం రాత్రి జరిగింది. కుకునూరుకు చెందిన రైతువేణుశేఖర్‌(35) అర్ధరాత్రి తన పొలానికి నీరు  పెట్టేందుకు  వెళ్లాడు. గ్రామ సమీపంలోని హల్దీ వాగులోని విద్యుత్‌ మోటారును ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. మృతదేహాన్ని మెదక్‌ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-02-28T05:27:15+05:30 IST