అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-19T06:02:29+05:30 IST

మండలంలోని బందార్లపల్లె గ్రామంలో సో మవారం శేఖర్‌ (25) అనే యువరైతు అప్పుల బాధతాళలేక తన వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపా రు.

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
శేఖర్‌ మృతదేహం


పెద్దవడుగూరు, అక్టోబరు18: మండలంలోని బందార్లపల్లె గ్రామంలో సో మవారం శేఖర్‌ (25) అనే యువరైతు అప్పుల బాధతాళలేక తన వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపా రు. వారు తెలిపిన  మేరకు... శేఖర్‌ తనకున్న నాలుగు ఎకరాల పొలంలో పత్తి, వేరుశనగ పంటలు సాగుచేశాడు. మూడేళ్లుగా దిగుబడి సరిగా లేకపో వడంతో పెట్టుబడుల కోసం, కుటుంబ అవసరాల కోసం తెచ్చిన రూ.5లక్షల అప్పును ఎలా తీర్చాలో తెలియక మథన పడుతుండేవాడు. ఈనేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది సోమవా రం వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని  రైతు లు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం పామిడి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2021-10-19T06:02:29+05:30 IST