అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-02-20T09:32:10+05:30 IST

వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి పెద్దతండాకు చెంది న రైతు ఆంజనేయులు నాయక్‌ (23) అప్పులబాధ తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

వజ్రకరూరు(ఉరవకొండ),ఫిబ్రవరి 19 : వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి పెద్దతండాకు చెంది న రైతు ఆంజనేయులు నాయక్‌ (23) అప్పులబాధ తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు నాయక్‌ తనకున్న 3 ఎకరాల పొలంతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. ఇందుకోసం రూ. 8 లక్షలు దాకా అప్పులు చేశాడు. పంట లు సరిగ్గా పండక పోవడంతో అప్పుల బాధ పెరిగిపోయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య దుర్గాబాయి, 11 నెలల పాప ఉంది. ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-20T09:32:10+05:30 IST