నీకెందుకంత అసహనం
ABN , First Publish Date - 2021-07-21T16:01:22+05:30 IST
‘అన్ని బూతులు తిట్టినా..
వసంతపై మాజీమంత్రి ఉమా
మైలవరం: ‘అన్ని బూతులు తిట్టినా నువ్వు రైతు సుబ్బారావు ఖాతాలో ధాన్యం బకాయి డబ్బులెందుకెయ్యలేదు. ప్రజాజీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేవి అయినంత మాత్రాన ఎందుకు నీకింత అహంకారం’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ను మంగళవారం మైలవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో సూటిగా ప్రశ్నించారు. ‘ప్రతిపక్ష నాయకుడిగా అడుగుతాం. బూతులు మాట్లాడమా రాజకీయం అంటే. ప్రశ్నిస్తుందుకేనా నాపై బూతుల పురాణం. తోలుకోడులో ఒక ఎస్సీ మహిళను చంపితే అది నీకు చిన్న విషయమా? ఆరోజు ఈడీ కేసు లేదన్నావు. మరి ఈరోజు ఎలా వచ్చింది? ఒక ఎస్సై ధాన్యం డబ్బులడిగిన రైతు ట్రాక్టర్ ఆపి గొడవ చేయాలని చూడటం ఏంటి? రైతుల కష్టం చెప్పుకుంటుంటే అనుచరుడితో రైతును బెదిరిస్తారా? ఇదేం పద్ధతి’ అని ఉమా మండిపడ్డారు.