ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-13T14:11:45+05:30 IST
యోనెక్స్-సన్రైజ్ ఇండియా ఓపెన్ 2022 పోటీల్లో పాల్గొనే ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు గురువారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది...
యోనెక్స్-సన్రైజ్ ఇండియా ఓపెన్ 2022 పోటీల్లో పాల్గొనే ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు గురువారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. కరోనా వచ్చిన వారిలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు.కొవిడ్-19కి పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఇండియా ఓపెన్ 2022 పోటీల నుంచి ఏడుగురు ఆటగాళ్లను ఉపసంహరించుకున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ గురువారం ధృవీకరించింది.
ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహిత సంబంధాలున్న వారిని కూడా టోర్నమెంట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్రీడల పోటీల్లో పాల్గొనే వారందరికీ ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి టెస్టింగ్ ప్రోటోకాల్లు అమలు చేశారు.ఇండియా ఓపెన్ రెండో రౌండ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.