కేంద్ర పథకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్టాంప్ వేసుకుంటోంది: yogi
ABN , First Publish Date - 2022-07-04T00:14:08+05:30 IST
కేంద్రం ప్రకటించిన పథకాలన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్టాంప్ వేసుకుంటోందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాధ్(yogi adityanath)ఆరోపించారు.
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పథకాలన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్టాంప్ వేసుకుంటోందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాధ్(yogi adityanath)ఆరోపించారు.తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు కావడం లేదని ఆయన అన్నారు.తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం మాకు స్ఫూర్తి అని యోగి అన్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ (bjp)బలం ఎంటో చూపించారు.భవిష్యత్ గురించి మేం ఎన్నో ఆలోచనలు చేశామని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో యూపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, త్వరలో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యానించారు.ఆయోధ్యలో రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు.సబ్కా సాత్.. సబ్కా వికాస్ భావనతో ముందుకెళ్తున్నామని యోగి స్పష్టం చేశారు.