గ్రేటర్‌లో నేడు యోగి ప్రచారం

ABN , First Publish Date - 2020-11-28T07:59:52+05:30 IST

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

గ్రేటర్‌లో నేడు యోగి ప్రచారం

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన మఽధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 3 గంటలకు మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలోని జీడిమెట్ల ప్రాంతంలో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి రోడ్‌షో ప్రారంభించి, ఆల్విన్‌ క్రాస్‌ రోడ్స్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు లాల్‌ దర్వాజ దగ్గర్లోని అల్కా థియేటర్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే సభలో పాల్గొంటారు.


Updated Date - 2020-11-28T07:59:52+05:30 IST