యోగా సనాతన ధర్మం ఇచ్చిన కానుక
ABN , First Publish Date - 2021-06-22T04:31:49+05:30 IST
యోగా మన పూర్వీకులు మన వారికి సనాతన ధర్మంగా ఇచ్చిన ఒక్క మంచి కానుక అని వీఎస్యూ వైస్ చాన్సలర్ బీ.రాజశేఖర్ అభివర్ణించారు.
వీఎస్యూ వైస్ చాన్సలర్ బీ రాజశేఖర్
వెంకటాచలం, జూన్ 21 : యోగా మన పూర్వీకులు మన వారికి సనాతన ధర్మంగా ఇచ్చిన ఒక్క మంచి కానుక అని వీఎస్యూ వైస్ చాన్సలర్ బీ.రాజశేఖర్ అభివర్ణించారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఎస్యూ జాతీయ సేవా పథకం, నెహ్రు యువ కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ వర్క్షాప్, యోగా సామూహిక ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్ చాన్సలర్ రాజశేఖర్ అన్లైన్లో పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా మన దేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప బహుమతి అని అన్నారు. కార్యక్రమంలో వీఎస్యూ రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాఎస్ నాయర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ డాక్టర్ ఏ. మహీంద్రరెడ్డి, ఎన్ఎస్ఎస్ సలహా మండలి సభ్యురాలు డాక్టర్ సునీత, డాక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.