ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2022-06-20T23:36:41+05:30 IST
Hyderabad: ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తప్పనిసరిగా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో యోగా దినోత్సవ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. తమ
Hyderabad: ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తప్పనిసరిగా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో యోగా దినోత్సవ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. తమ ఆదాయంలో 30 శాతాన్ని ప్రజలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. యోగాను అందరూ అలవరుచుకోవాలని, పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని, రేపు ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే మైసూర్లో ప్రధాని మోదీ.. కోయంబత్తూరులో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్నారని తెలిపారు.