నేవీలో యోగా దినోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-21T06:30:43+05:30 IST
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆజాదిక అమృత మహోత్సవ్ పేరుతో తూర్పు నౌకాదళం సిబ్బంది వివిధ ప్రాంగణాల్లో యోగా వేడుకలు నిర్వహించారు.
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆజాదిక అమృత మహోత్సవ్ పేరుతో తూర్పు నౌకాదళం సిబ్బంది వివిధ ప్రాంగణాల్లో యోగా వేడుకలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 2,674 మంది యోగాసనాలు వేశారు. వివిధ నౌకలపై, వివిధ విభాగాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.