సాయి దత్త పీఠం ఆధ్వరంలో యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-06-23T16:03:46+05:30 IST

న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాను భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనా.. అది ప్రపంచానికి ఎంత మేలు చేస్తుందనేది ప్రముఖ యోగా శిక్షకురాలు డా. విజయ నిమ్మ వివరించారు.

సాయి దత్త పీఠం ఆధ్వరంలో యోగా దినోత్సవం

అమెరికన్లకు యోగా పాఠాలు నేర్పిన విజయ నిమ్మ 

ఎడిసన్, న్యూ జెర్సీ: న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాను భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనా.. అది ప్రపంచానికి ఎంత మేలు చేస్తుందనేది ప్రముఖ యోగా  శిక్షకురాలు డా. విజయ నిమ్మ వివరించారు. యోగాసనాలు వేయించి అవి ఆరోగ్యానికి ఎంత ఉపకరిస్తాయనేది తెలియ‌జేశారు. ఆ తర్వాత తాను విధులు నిర్వహించే  నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో విజయ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిగేలా చూశారు.


విజయ నిమ్మ విజ్ఞప్తిని పరిశీలించి నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ కెర్రీ పొవెల్ సంస్థలో యోగా దినోత్సవాన్ని జరిపేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. సీఓఓ మిస్టర్ జాన్ బోన్, సైట్ అడ్మినిస్ట్రేటర్ హాజీరబేజ్ ఖాన్ నాయకత్వంలో ఈ యోగా దినోత్సవం జరిగింది. కార్పొరేషన్ సీఎంఓ డాక్టర్ పెన్నింగ్టన్ కూడా ఇందుకు తన వంతు పూర్తి సహకారం అందించారు. దీంతో డా.విజయ, ఈ కార్పొరేషన్ ఉద్యోగులకు యోగాపై అవగాహన క‌లిగించారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. వారి చేత యోగాసనాలు వేయించారు. ఆ ఆసనాల వల్ల కలిగే లాభాలను స్పష్టంగా తెలిపారు. 


సాయి దత్త పీఠం గురుకులంలో యోగా శిక్షకురాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సాయి దత్త పీఠంలో జరపడంతో పాటు నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో కూడా యోగా దినోత్సవాన్ని చేయడం పట్ల  సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి హర్షం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం నాడు అందరికి యోగాపై అవగాహన కల్పించినందుకు  డా.విజయ నిమ్మను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు ఆ సాయి నాధ, శ్రీ మాతా కృప సదా ఉండాలని ఆశీర్వదించారు.











Updated Date - 2021-06-23T16:03:46+05:30 IST