15 నుంచి ఆన్లైన్లో యోగా తరగతులు
ABN , First Publish Date - 2020-07-11T09:58:59+05:30 IST
ఆంధ్రా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ యోగా ఆద్వర్యంలో ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నట్టు యోగా
ఏయూ క్యాంపస్, జూలై 10: ఆంధ్రా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ యోగా ఆద్వర్యంలో ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నట్టు యోగా విభాగం అధిపతి డాక్టర్ కె.రమేశ్బాబు, గౌరవ డైరెక్టర్ ప్రొఫెసర్ భానుకుమార్ తెలిపారు. నెల రోజులపాటు జనరల్, బరువు తగ్గేందుకు యోగా తరగతులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. జనరల్ యోగా ఉదయం 6 నుంచి 7 వరకు, బరువు తగ్గే యోగా తరగతులు 7:15 నుంచి 8:15 వరకు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వారు 9985752215 నంబరును సంప్రదించాలని సూచించారు.