మహిళలకు రామకృష్ణమఠం ఆన్‌లైన్ యోగా తరగతులు

ABN , First Publish Date - 2020-11-03T22:06:44+05:30 IST

నగరంలోని దోమలగూడలో ఉన్న రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ మహిళలకు యోగా తరగతులను ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసింది.

మహిళలకు రామకృష్ణమఠం ఆన్‌లైన్ యోగా తరగతులు

హైదరాబాద్: నగరంలోని దోమలగూడలో ఉన్న రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ మహిళలకు యోగా తరగతులను ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసింది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు వారాల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు తదితరాలలో శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఈ తరగతులు సాయంత్రం 5 గంటలకు మొదలై 6 గంటల వరకు ముగియనున్నాయి. 16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. 


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.  మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. 


రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-11-03T22:06:44+05:30 IST