తమిళనాడులో మరో మంత్రికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-10T21:04:53+05:30 IST

రాష్ట్ర కేబినెట్‌ను కరోనా కుదిపేస్తోంది. మొన్నటికి మొన్న ఇద్దరు మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా

తమిళనాడులో మరో మంత్రికి కరోనా పాజిటివ్

చెన్నై : రాష్ట్ర కేబినెట్‌ను కరోనా కుదిపేస్తోంది. మొన్నటికి మొన్న ఇద్దరు మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా సహకార మంత్రి సెల్లూరు కె. రాజుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈయనను కలిపితే కేబినెట్‌లో మొత్తం ముగ్గురు మంత్రులకు కరోనా సోకింది. విద్యుత్ మంత్రి తంగమని, ఉన్నత విద్యామంత్రి కేపీ అన్బగన్ కరోనా సోకిన వారిలో ఉన్నారు. ముగ్గురు మంత్రులు కాకుండా 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. 

Updated Date - 2020-07-10T21:04:53+05:30 IST