సంచార జాతులపై అధ్యయనం చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T05:22:05+05:30 IST

నేటికీ గుర్తింపు పొందని సంచార జాతులపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక పంపాలని మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, వైసీపీ పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ చంద్రగిరి ఏసురత్నం, ఇతర నాయకులు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను కోరారు.

సంచార జాతులపై అధ్యయనం చేయాలి
మంత్రి గోపాలకృష్ణతో మాట్లాడుతున్న ఏసురత్నం తదితరులు

మంత్రికి మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఏసురత్నం వినతి

గుంటూరు, డిసెంబరు 2: నేటికీ గుర్తింపు పొందని సంచార జాతులపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక పంపాలని మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, వైసీపీ పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ చంద్రగిరి ఏసురత్నం, ఇతర నాయకులు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను కోరారు.  ఈ మేరకు సచివాలయంలోని చాంబర్‌లో మంత్రిని కలిసి  వినతిపత్రం అందజేశారు. నేటికీ అనేక సంచార జాతులు కనీస గుర్తింపునకు సైతం నోచుకోని దయనీయస్థితిలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో వడ్డెర ఉద్యోగుల సంక్షేమ సంఘం అసోసియేట్‌ జనరల్‌ సెక్రటరీ తన్నీరు రాయలబాబు, ఆర్‌.వెంకటేశ్వర్లు, వీర్ల కొండలు తదితరులున్నారు.  


Updated Date - 2020-12-03T05:22:05+05:30 IST