బంధువుల ఇంటికొచ్చి.. బైక్‌పై తిరిగి వెళ్లే సమయంలో..

ABN , First Publish Date - 2020-09-23T17:51:18+05:30 IST

మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో..

బంధువుల ఇంటికొచ్చి.. బైక్‌పై తిరిగి వెళ్లే సమయంలో..

ఎమ్మిగనూరు(కర్నూలు): మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామ సమీపంలో   మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో గోనెగండ్లకు చెందిన రవితేజ (21), అతని చిన్నమ్మ కూతురు నిహారిక(13) అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. రవితేజ ఎమ్మిగనూరులోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో నిహారికను వెంట బెట్టుకుని ద్విచక్ర వాహనంపై గోనెగండ్లకు బయల్దేరారు. రాళ్లదొడ్డి సమీపంలో ముందు వెళ్తున్న లారీని దాటే ప్రయత్నం చేయగా, అదే లారీ ఢీ కొట్టింది. ఇద్దరూ లారీ చక్రాల కింద పడ్డారు.


సమాచారం తెలుసుకున్న రహదారి భద్రత సిబ్బంది మాలిక్‌, రవికుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ మహేశ్వర రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


ఆసుపత్రిలో రోదనలు

ప్రమాదం గురించి తెలియగానే రవితేజ, నిహారిక తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. వారి బంధు వులు పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి తరలిరావ డంతో ఆస్పత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటాయి. 

Updated Date - 2020-09-23T17:51:18+05:30 IST