బీవీకి సన్మానం
ABN , First Publish Date - 2020-11-30T05:56:26+05:30 IST
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని ఆదివారం పార్టీ నాయకులు సన్మానించారు.
ఎమ్మిగనూరు టౌన్, నవంబరు29: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని ఆదివారం పార్టీ నాయకులు సన్మానించారు. నవాజ్, గౌస్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పాటుపడే బీవీ మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. వలి, నవాజ్, భాస్కర్, సూరి, బకర్, ఇర్ఫాన్, సోహైల్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.