Red Sea: యూఏఈ నౌకను బంధించిన యెమెన్ రెబెల్స్!
ABN , First Publish Date - 2022-01-04T12:59:03+05:30 IST
ఎర్రసముద్రంలో కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య నౌకా మార్గంలో వైద్య పరికరాలను తీసుకెళ్తున్న యూఏఈ నౌకను యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు బంధించారు.
దుబాయ్, జనవరి 3: ఎర్రసముద్రంలో కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య నౌకా మార్గంలో వైద్య పరికరాలను తీసుకెళ్తున్న యూఏఈ నౌకను యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు బంధించారు. ఈ విషయాన్ని సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణ కూటమి వెల్లడించింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్లోని ప్రధాన వార్తా పత్రిక జెరూసలెం పోస్ట్ వెబ్సైట్ను హ్యాకర్లు టార్గెట్ చేశారు. 2020లో అమెరికా డ్రోన్ల దాడిలో ఇరాన్ టాప్ జనరల్ ఖాసీం సొలేమన్ మరణించినప్పటి ఘటనను గుర్తు చేస్తూ క్షిపణితో దాడి చేస్తున్నట్టుగా ఉన్న చిత్రాన్ని వెబ్సైట్ హోం పేజీలో హ్యాకర్లు పోస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నదానిపై ఏ సంస్థా స్పందించలేదు. వరుస సంఘటనలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత నెలకొంది.