టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

ABN , First Publish Date - 2022-02-28T13:04:08+05:30 IST

రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావుకు కన్నుముశారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‎లోని తన నివాసంలో

టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

గుంటూరు: రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (104) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‎లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. రైతు నాయకుడిగానూ ఆయన సేవలందించారు. సంగం డైయిరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడుగా ఉన్నారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో యడప్లాటి జన్మించారు. 1967,1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్‎గా, 1998లో రాజ్యసభ్యుడిగా యడ్లపాటి వెంకట్రావు ఎన్నియ్యారు.

Updated Date - 2022-02-28T13:04:08+05:30 IST