కోవిడ్-19: విరాళాలివ్వండి ప్లీజ్.. సీఎం వినతి..

ABN , First Publish Date - 2020-04-01T01:32:47+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వీలుగా సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ కర్నాటక ప్రజలకు ముఖ్యమంత్రి..

కోవిడ్-19: విరాళాలివ్వండి ప్లీజ్.. సీఎం వినతి..

బెంగళూరు: కరోనా మహమ్మారిపై పోరాటం కోసం సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ కర్నాటక ప్రజలకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాడేందుకు కర్నాటక శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అయితే పౌరులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ నాయకుల సహాయం లేకుండా ఈ పోరాటంలో ముందుకెళ్లడం కష్టం..’’ అని ట్విటర్లో సీఎం యడియూరప్ప పేర్కొన్నారు. ‘‘దయచేసి సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు ఇవ్వాలనీ, ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం అలసిపోకుండా సాయం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను..’’ అని ఆయన మరో ట్వీట్‌లో కోరారు. కాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కర్నాటకలో 98 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-01T01:32:47+05:30 IST