Yediyurappa : అమిత్‌షా నాతో ఆ విషయం చెప్పారు

ABN , First Publish Date - 2021-07-17T19:52:58+05:30 IST

కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ..

Yediyurappa : అమిత్‌షా నాతో ఆ విషయం చెప్పారు

న్యూఢిల్లీ : కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ... ‘‘కర్నాటకలో తిరిగి అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేయమని అమిత్‌షా నాకు సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని కూడా సూచించారు’’ అని యూడియూరప్ప పేర్కొన్నారు. యూపీలో, అటు కర్నాటకలో అత్యధిక స్థానాలు గెలిస్తే సునాయాసంగా విజయం సాధ్యమవుతుందని అన్నారని సీఎం పేర్కొన్నారు. కర్నాటకలో పార్టీ పటిష్ఠతకు బాధ్యతలు తీసుకోవాలని తనకు సూచించారని, అందుకు తాను సిద్ధమేనని హామీ ఇచ్చానని యడియూరప్ప పేర్కొన్నారు. ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కూడా భేటీ అయ్యారు. 


Updated Date - 2021-07-17T19:52:58+05:30 IST