యడియూరప్ప మనుమరాలి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-28T21:14:16+05:30 IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనుమరాలు (30) సౌందర్య ఆత్మహత్యకు..

యడియూరప్ప మనుమరాలి ఆత్మహత్య

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మనుమరాలు (30) సౌందర్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరు సెంట్రల్ బిజినెస్ జిల్లాలోని వసంత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో శుక్రవారంనాడు ఆమె ఉరివేసుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంటుకు వచ్చిన పనిమనిషి ఎంతకూ లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో సౌందర్య భర్త నిరంజన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే ఫోన్ కాల్ చేసినప్పటికీ సౌందర్య నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. తనవద్ద నున్న స్పేర్ తాళం చెవితో తలుపులు తీశారు. సౌందర్య ఉరివేసుకుని కనిపించడంతో ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, ఆప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.


సౌందర్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసి, శవపరీక్ష కోసం బౌరింగ్ ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు. సౌందర్య తన తొమ్మిది నెలల పాప, వైద్య వృత్తిలో ఉన్న తన భర్త నిరంజన్‌తో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. 2018లో నిరంజన్‌, సౌందర్యల వివాహం జరిగింది. ప్రెగ్నస్నీ తర్వాత డిప్రెషన్‌తో సౌందర్య బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ఆయితే, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైట్ నోట్ దొరకలేదు. సౌందర్య కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయినందున వారిని తాము  ప్రశ్నించ లేకున్నామని, అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత కేసు సమగ్ర దర్యాప్తు జరుపుతామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-01-28T21:14:16+05:30 IST