సీఎం కుమార్తెకూ కరోనా పాజిటివ్గా నిర్ధారణ..
ABN , First Publish Date - 2020-08-03T22:07:22+05:30 IST
ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్లో..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమార్తె పద్మావతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆమె మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. యడియూరప్పకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయనకు అదే ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. యడియూరప్ప కుమారుడు విజయేంద్రకు కరోనా నెగిటివ్గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి కరోనా టెస్టులు చేయించుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు.