గ్రామాల్లో యథేచ్ఛగా సారా విక్రయాలు

ABN , First Publish Date - 2022-05-16T06:45:46+05:30 IST

గ్రామాల్లో యథేచ్ఛగా సారా విక్రయాలు

గ్రామాల్లో యథేచ్ఛగా సారా విక్రయాలు

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, మే 15 : బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పోలీసు శాఖకుగాని, ఎకై్ౖసజ్‌శాఖకు గానితెలియనట్లే చోద్యం చూస్తున్నారని మల్లవల్లి, వీరవల్లి, నారాయణపురం తదితర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లవల్లి గ్రామ కూడలిలో ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి నాటుసారా సేవి స్తూ అడిగిన వారిని దుర్భాషలాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. ఇదే గ్రామానికి చెందిన తూము సరసింహారావు అనే వ్యక్తి నాటుసారా తాగడం వల్ల ప్రాణాపాయస్ధితికి చేరుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.  నూజివీడు మండల గ్రామాల నుంచి 50 రూపాయల ప్యాకెట్లలో నాటుసారా తెచ్చి విచ్చల విడిగా అమ్ముతున్నారని, వ్యసనానికి బానిసైన వారు వాటిని తాగి అనారోగ్యం పాలవ డమే కాక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఎకై్ౖసజ్‌, పోలీసుశాఖ  సారాను అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2022-05-16T06:45:46+05:30 IST