వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-02-16T21:51:58+05:30 IST

ప్రజల సౌకర్యం కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు.

వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కర్నూలు: ప్రజల సౌకర్యం కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. పేదల దగ్గర గ్రామ వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, వసూలు చేసిన డబ్బులను నేతలకు ఇస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు. వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని బాలనాగిరెడ్డి సూచించారు. బాలనాగిరెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు రుచించడం లేదు. ఆయన చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. స్వంత పార్టీ నేతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను తప్పుబట్టడంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి. బాలనాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా ఆయనపై ఒత్తిడి చేస్తారనే చర్చ కూడా సాగుతోంది.

Updated Date - 2020-02-16T21:51:58+05:30 IST