టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర: మంతెన

ABN , First Publish Date - 2021-11-07T00:07:29+05:30 IST

టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు.

టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర: మంతెన

అమరావతి: టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ఎదురించి భారీగా నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు. 328 స్థానాలకు గానూ.. 322 చోట్ల నామినేషన్లు వేశారని చెప్పారు. ఎన్నికల వ్యవస్థను కూడా హైజాక్ చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అప్రజాస్వా విధానాలను మున్సిపల్ ఎన్నికల్లో ఎదురించాలని సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-11-07T00:07:29+05:30 IST