విద్యార్థులను రప్పించేందుకు చర్యలు: మంత్రి సురేష్‌

ABN , First Publish Date - 2020-04-03T08:50:48+05:30 IST

విద్యార్థులను రప్పించేందుకు చర్యలు: మంత్రి సురేష్‌

విద్యార్థులను రప్పించేందుకు చర్యలు: మంత్రి సురేష్‌

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను  రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ విధించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రికి లేఖలు, ఈ-మెయిల్స్‌ అందాయి. వీటిపై స్పందించిన మంత్రి విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను కోరారు.  లాక్‌డౌన్‌ ముగిసే వరకు వారికి అన్ని వసతులు కల్పించి, అనంతం రాస్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా హై కమిషనర్‌ రుచి ఘన శ్యామ్‌కు మంత్రి ఫోన్‌లో విజ్ఞప్తిచేశారు.

Updated Date - 2020-04-03T08:50:48+05:30 IST