‘దాడుల వెనుక వైసీపీ అధిష్టానం హస్తం’
ABN , First Publish Date - 2021-10-20T00:39:05+05:30 IST
టీడీపీ కార్యాలయాల దాడులపై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు బక్కిన నరసింహులు తీవ్రంగా ఖండించారు...
హైదరాబాద్: టీడీపీ కార్యాలయాల దాడులపై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు బక్కిన నరసింహులు తీవ్రంగా ఖండించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవటానికే జగన్ ప్రభుత్వం దాడులకు దిగుతోందని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారమే ఏక కాలంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయటం దారుణమన్నారు. ఈ దాడుల వెనుక వైసీపీ అధిష్టానం హస్తం ఉందని ఆరోపించారు.