కుతంత్రాలు, కూల్చివేతలతో వైసీపీ పాలన
ABN , First Publish Date - 2022-06-22T05:09:59+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ మూడేళ్ల పాలన కుతంత్రాలు, కూల్చివేతలతోనే సాగిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. గుగ్గిలి పంచాయతీలో మంగళవారం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలపై కరపత్రాలతో అవగాహన కలిగించారు.
మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
కొనసాగుతున్న ‘బాదుడే బాదుడు’
జలుమూరు, జూన్ 21: రాష్ట్రంలో వైసీపీ మూడేళ్ల పాలన కుతంత్రాలు, కూల్చివేతలతోనే సాగిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. గుగ్గిలి పంచాయతీలో మంగళవారం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలపై కరపత్రాలతో అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రాభివృద్ధి 25 ఏళ్లు వెనక్కు మళ్లిందని ఆరోపించారు. నిత్యావసర సరుకుల రేట్లతో పాటు విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచి సామాన్యుల నడ్డివిరిచిందన్నారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వ సొమ్మును దుబారా చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనపై ప్రజ లు విసుగుచెందారని, రానున్న ఎ్ననకల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, సర్పంచ్లు దుంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, నాయకులు జల్లు చంద్రమౌళి, రోణంకి కృష్ణంనాయుడు, బైరి భాస్కరరావు, బగ్గు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.