‘వైసీపీ’ పాలన విఫలం
ABN , First Publish Date - 2020-06-06T10:04:59+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్
నెల్లిమర్ల, జూన్ 5: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్కుమార్ విమర్శించారు. నెల్లిమర్లలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి ‘మీ పాలన- మా సూచన’ పేరుతో కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ రాస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ లేఖను ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఏకవ్యక్తి నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. కనీసం మంత్రులకు కూడా తెలియకుండా ఉత్తర్వులు జారీ కావడం విచిత్రమన్నారు. సమావేశంలో వైసీపీ నెల్లిమర్ల మండల అధ్యక్షుడు కనకల పద్మనాభం, పూసపాటిరేగ మండల అధ్యక్షుడు చనమల్లు రామునాయుడు, పార్టీ నాయకులు చందక పైడినాయుడు, రాయి చిన్నఅప్పలస్వామి, కిల్లంపల్లి రామకృష్ణ, వలిరెడ్డి రమణ పాల్గొన్నారు.