రెండవ రోజు YCP plenary సమావేశాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-09T16:54:06+05:30 IST
వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి.
అమరావతి: వైసీపీ ప్లీనరీ (YCP plenary) సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిందని తెలిపారు. ‘‘శత్రువులపై వ్యూహత్మకమైన దాడులు నిర్వహించాలి... ప్రజల్లో మన శత్రువులు ఇష్టం వచ్చినట్టు మాటాడుతున్నారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మనం కథనరంగంలోకి దిగి కార్యోన్ముఖులం కావాలి’’ అంటూ పిలుపునిచ్చారు. స్పీకర్ ప్లీనరీకి వచ్చారని... రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఓ పేపర్లో రాశారని... గతంలో స్పీకర్ కొడెల రాలేదా అది కనపడలేదా అని ప్రశ్నించారు. ‘‘నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తరువాతే ఎమ్మెల్యే, శాసనసభాపతిని’’ అని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.