వైసీపీ ప్లీనరీకి స్కూల్, కాలేజీ బస్సుల తరలింపు... విద్యార్థుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-07-08T15:57:06+05:30 IST

వైసీపీ ప్లీనరీలో జిల్లాలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైసీపీ ప్లీనరీకి స్కూల్, కాలేజీ బస్సుల తరలింపు... విద్యార్థుల ఇక్కట్లు

ప్రకాశం: వైసీపీ (YCP) ప్లీనరీ నేపథ్యంలో జిల్లాలో విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లీనరీ (Plenary) కోసం వైసీపీ నాయకులు జిల్లాలోని స్కూల్స్,(schools) కాలేజీ(collage)లకు చెందిన బస్సులను తరలించారు. బస్సులు లేకపోవడంతో స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు... ఆర్టీసీ (RTC) అధికారులతో మాట్లాడుకుని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులను కాలేజీకి తీసుకెళ్లారు. మరోవైపు బస్సులు లేక పలు స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. కాగా... వైసీపీ నేతల తీరుపై విద్యార్థుల(Students) తల్లిదండ్రులు(Parents) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-07-08T15:57:06+05:30 IST