వెలవెలబోయిన YCP ప్లీనరీ సమావేశం
ABN , First Publish Date - 2022-06-28T19:54:35+05:30 IST
అనంతలో జిల్లా స్థాయి YCP ప్లీనరీ సమావేశం వెలవెలబోయింది. ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
Ananthapuram : అనంతలో జిల్లా స్థాయి YCP ప్లీనరీ సమావేశం వెలవెలబోయింది. ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ‘ఏందయ్యా మాకు ఒక మనిషి.. ఆర్డీవో కూడా పలకడం లేదు’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి ముందు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో సగానికిపైగా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ప్లీనరీ సమావేశాలకు కార్యకర్తలు మొహం చాటేశారు. కార్యకర్తలు లేక నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.