ప్లాంట్‌పై వైసీపీ నాటకాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-07-06T06:40:19+05:30 IST

ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకుండా కేంద్రంతో కుమ్మకై వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను కార్మికులు, నిర్వాసితులు తిప్పికొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ప్లాంట్‌పై వైసీపీ నాటకాలను గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు  

గాజువాక, జూలై 5: ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకుండా కేంద్రంతో కుమ్మకై వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను కార్మికులు, నిర్వాసితులు తిప్పికొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గాజువాక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి జగన్‌ ఘోరంగా విఫలమయ్యారన్నారు. స్టీల్‌ప్లాంట్‌, రైల్వేజోన్‌, పోలవరం ప్రాజెక్టులపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీదే ఘన విజయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు బొండా జగన్‌, గంధం శ్రీనివాస్‌, మొల్లి ముత్యాలనాయుడు, పల్లా శ్రీనివాసరావు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మి, తెలుగు యువత అధ్యక్షుడు బలగ బాలునాయుడు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-06T06:40:19+05:30 IST