వైసీపీ అంటే నాకు ఏమాత్రం ద్వేషం లేదు: పవన్
ABN , First Publish Date - 2022-04-23T23:35:26+05:30 IST
వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు
ఏలూరు: వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల దీన స్థితిపై పవన్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఆర్థిక సాయం అదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సమావేశంలో పవన్ మాట్లాడుతూ వైసీపీ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని హెచ్చరించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు కనిపించడం లేదన్నారు. తనను దత్తపుత్రుడని ఇంకోసారి అంటే.. సీబీఐ దత్తపుత్రుడు అని తానూ అనాల్సి వస్తుందన్నారు. చంచల్గూడ జైల్లో షటిల్ ఆడుకున్న వాళ్లా..తనకు నీతులు చెప్పేది అని పవన్కల్యాణ్ హెచ్చరించారు.