రెచ్చిపోయిన YCP మట్టి మాఫియా.. Dhulipalla కారుపై దాడి..

ABN , First Publish Date - 2022-06-13T20:35:06+05:30 IST

Guntur జిల్లా: పెదకాకానీ మండలం, అనుమర్లపూడిలో YCP మట్టి మాఫియా రెచ్చిపోయింది.

రెచ్చిపోయిన YCP మట్టి మాఫియా.. Dhulipalla కారుపై దాడి..

Guntur జిల్లా: పెదకాకానీ మండలం, అనుమర్లపూడిలో YCP మట్టి మాఫియా రెచ్చిపోయింది. మట్టి తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra)ను వైసీపీ మట్టిమాఫియా అడ్డుకుంది. ఆయన కారుపై రాళ్లతో దాడికి పాల్పడింది. మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ.. వీడియో తీయనీయకుండా అడ్డుకున్నారు. ప్రశ్నించే వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు.


నిన్న మధ్యాహ్నం ప్రత్తిపాడు మండలం, వంగిపురం దళిత సర్పంచ్ విజయలక్ష్మిపై కూడా  మట్టి మాఫియా దాడికి పాల్పడింది. రాత్రి చుండూరు మండలం, చిన్నగాదెలవర్రులో లక్ష్మయ్య అనే వ్యక్తిపై దాడి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా దారుణంగా జరుగుతోందన్నారు. నెల రోజుల నుంచి వందలు, వేలాది ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలు మొత్తం చెరువులోనే ఉన్నాయన్నారు. ఎప్పుడూ లేని విధంగా డెల్టా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో ఘోరాతిఘోరంగా జరుగుతోందన్నారు. 5 వందల ట్రిప్పులు వెళ్లాయని చెప్పారు. పోలీసులు, అధికారులు పట్టించుకోవడంలేదని, వాళ్లకు వాటాలు వెళుతున్నాయని నక్కా ఆనందబాబు ఆరోపించారు.

Updated Date - 2022-06-13T20:35:06+05:30 IST