వైసీపీ నేతల భూ అక్రమాలపై వైసీపీ నేత ఫైర్
ABN , First Publish Date - 2021-10-25T20:16:18+05:30 IST
వైసీపీ నేతల భూ అక్రమాలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురం ఉరవకొండలో కొందరు వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని చెప్పారు.
అమరావతి: వైసీపీ నేతల భూ అక్రమాలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురం ఉరవకొండలో కొందరు వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడేవారిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సీఎం జగన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. కూడేరు, ఉరవకొండలోని భూముల్లో అక్రమ లేఔట్లు వేస్తూ ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై విచారణ చేయాలన్నారు.