AP: ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం భేటీ

ABN , First Publish Date - 2021-09-30T16:38:46+05:30 IST

రాష్ట్ర ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ గురువారం భేటీ అయ్యారు.

AP: ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం భేటీ

విజయవాడ: రాష్ట్ర ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలపై చర్చించనున్నారు. ప్రాజెక్ట్‌లలో పూర్తి ఖర్చు తామే భరించలేమని రైల్వే చెబుతోంది. పెండింగ్ నిధులు, ప్రాజెక్ట్‌ల జాప్యంపైనా భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలోని ఎంపీలు కనకమేడల, అయోధ్య రామి రెడ్డి, మార్గాని భారత్, గోరంట్ల మాధవ్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, వంగా గీత, సత్యవతి, ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్ప, బ్రహ్మానంద రెడ్డి, తలారి రంగయ్య, అనురాధ హాజరయ్యారు. ఎంపీలు గల్లా జయదేవ్, కోటగిరి శ్రీధర్, కేశినేని నాని, బాలసౌరి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. కాగా విజయవాడ డివిజన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను కేశినేని నాని తన ప్రతినిధుల ద్వారా పంపించారు. 

Updated Date - 2021-09-30T16:38:46+05:30 IST