స్పీకర్‌ బిర్లా సేవలో వైసీపీ ఎంపీలు

ABN , First Publish Date - 2021-08-19T16:56:07+05:30 IST

కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి..

స్పీకర్‌ బిర్లా సేవలో వైసీపీ ఎంపీలు

అమరావతి(ఆంధ్రజ్యోతి): కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దగ్గర వైసీపీ ఎంపీలు బారులు తీరడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన స్పీకర్‌కి రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలకడం, ఆ తర్వాత మర్యాదపూర్వకంగా కలువడం... ఇదే రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఓం బిర్లాకు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలుకడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గురుమూర్తి  రెండు రోజులుగా ఆయన వెంటే ఉండడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. స్పీకర్‌ వెన్నంటి ఉండి సపర్యలు చేయడానికి అసలు కారణం నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అతిత్వరగా అనర్హత వేటు వేయాలని కోరేందుకేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Updated Date - 2021-08-19T16:56:07+05:30 IST