భవిష్యత్తులో నేను ఉన్నా లేకున్నా...విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-12-21T23:17:41+05:30 IST

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర

భవిష్యత్తులో నేను ఉన్నా లేకున్నా...విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను ఉన్నా లేకున్నా  వైఎస్ఆర్ క్రికెట్ కప్ పోటీలు కొనసాగుతాయని ఆయన అన్నారు.  నగరంలో విశాఖ  వైఎస్ఆర్ క్రికెట్ కప్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కప్ వలన క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుందన్నారు. ఈ పోటీలలో 490 టీంలు పాల్గొంటున్నాయన్నారు. 19 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రా క్రికెట్, ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్లను విశాఖకు తీసుకు రావాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు,  కలెక్టర్ మల్లికార్జున్, ఆంధ్ర యూనివర్సిటీ,  వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్ రెడ్డి, జిల్లా అధికారులు, క్రీడాకారులు హాజరయ్యారు.

Updated Date - 2021-12-21T23:17:41+05:30 IST