అత్యుత్తమ నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తాం: విజయసాయిరెడ్డి
ABN , First Publish Date - 2020-11-22T02:03:32+05:30 IST
దేశంలో, ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ: దేశంలో, ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పాలనా రాజధానిగా మారిన క్రమంలో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని విధానాలను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు.
విశాఖను టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నానికి లోకేషన్, లేబర్ అవైలబుల్టీ అడ్వాంటేజ్గా ఉందన్నారు. పోర్ట్ సిటీ అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం నుంచి పెట్రోలియం ట్రైబల్ యూనివర్సిటీలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 11 శాతం ఎఫ్డీఐలు రాబోతున్నాయని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.