The Debate: ఎన్టీఆర్ కూతురు మరణాన్ని రాజకీయం చేస్తున్నదెవరు?
ABN , First Publish Date - 2022-08-04T01:23:58+05:30 IST
ఎన్టీఆర్ (Ntr) కుమార్తె ఉమా మహేశ్వరి (Uma Maheswari) ఆత్యహత్య చేసుకున్నారు. ఆమెకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మరోవైపు పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి...
హైదరాబాద్ (Hyderabad): ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి (Ntr Daughter Uma Maheswari) ఆత్యహత్య చేసుకున్నారు. ఆమెకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మరోవైపు పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై వైసీపీ సోషల్ మీడియా (Social Media) ఇంఛార్జి దేవేందర్ రెడ్డి (Devendar Reddy), వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Ycp Mp Vijaysaireddy) చేసిన ట్వీట్ బూమరాంగ్ అవుతోంది. ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు నారా లోకేశ్ (Nara Lokesh), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కారణమనడంపై విమర్శలు వెల్లువెత్తువెత్తున్నాయి. ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై చిల్లర ట్వీట్లు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘ఎన్టీఆర్ కూతురు మరణాన్ని రాజకీయం చేస్తున్నదెవరు?
చెత్త రాజకీయాల కోసం ఇంత దిగజారాలా?
విజయసాయిరెడ్డి ఎందుకు విషం చిమ్ముతున్నాడా?
సాయిరెడ్డి కూతలకు జగన్ కూడా వంతపాడుతున్నారా?
నిత్యం అరాచకాల బురదలో పొర్లాడే సాయిరెడ్డిని ఏమనాలి?
తల్లినీ, చెల్లినీ తరిమేసిన వాళ్లా అన్న గారి కుటుంబం గురించి మాట్లాడేది?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.