శపథం చేసి మరీ అనుకున్నది సాధించిన రఘురామకృష్ణంరాజు

ABN , First Publish Date - 2020-08-07T01:13:38+05:30 IST

పార్టీ పేరునే మార్చేస్తానని చెప్పి శపథం చేసి చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుకున్నది సాధించుకున్నారు. ..

శపథం చేసి మరీ అనుకున్నది సాధించిన రఘురామకృష్ణంరాజు

హైదరాబాద్: పార్టీ పేరునే మార్చేస్తానని చెప్పి శపథం చేసి చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుకున్నది సాధించుకున్నారు. మొత్తం మీద 11 మంది సిబ్బందితో కూడిన వై కేటగిరి భద్రతను సాధించుకున్నారు. వై కేటగిరిని చాలా కీలకమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారని చెబుతున్నారు. మహామహానాయకులే ట్రై చేస్తున్నా దొరకడం లేదు భద్రత. ప్రస్తుతం బీజేపీలో ఉన్న వాళ్లు చాలా మంది ప్రయత్నం చేసినా కూడా ఈ భద్రత దొరకడం లేదంట. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ భద్రత కోసం ట్రై చేశారట. అప్పుడు ఆయనకూ ఈ భద్రత దొరకలేదట. మరి రఘురామకృష్ణంరాజుకు ఎలా దొరికింది అనేది ఒక ప్రశ్న. ఇవాళ ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టడం, అమరావతి మహిళలను కుక్కలతో పోల్చడంపై రఘురామ చాలా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. ఇలాంటి అంశాలపై ఆయనతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొద్దిసేపు చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను వైసీపీ ఎంపీను కాదని.. యువజనశ్రామికరైతు పార్టీ ఎంపీనన్నారు. 


Updated Date - 2020-08-07T01:13:38+05:30 IST