టీడీపీతో రఘురామ కుమ్మక్కు: వైసీపీ ఎంపీ మార్గాని
ABN , First Publish Date - 2021-12-04T08:38:20+05:30 IST
ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో ఎంపీ రఘురామకృష్ణరాజు కుమ్మక్కై, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రాజమండ్రి
న్యూఢిల్లీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో ఎంపీ రఘురామకృష్ణరాజు కుమ్మక్కై, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఏపీ భవన్లో విలేకర్లతో మాట్లాడుతూ రఘురామరాజుపై విరుచుకుపడ్డారు. ఓటీఎ్సపై మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కరోనా అంశంపై తాను మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించారన్నారు.
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో... ప్రైవేటు బిల్లు పెట్టాలి
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని వైసీపీ ఎంపీలు మార్గని భరత్, అనురాధ, వంగా గీత, చంద్రశేఖర్, మాధవ్లకు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ కోరారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీలో ఆయన ఎంపీలకు వినతి పత్రం అందించారు.