రఘురామను తిట్ట లేదు: ఎంపీ గోరంట్ల
ABN , First Publish Date - 2021-12-10T21:40:59+05:30 IST
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజును తాను తిట్ట లేదని
ఢిల్లీ: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజును తాను తిట్ట లేదని ఆ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. ఇద్దరం ఎదుట పడినంత మాత్రాన తిట్టాడని సృష్టిస్తే ఎలా అని ఎదురు ప్రశ్న వేశారు. రాత్రి వేళల్లో కూడా పోస్ట్మార్టం సేవలు అందుబాటులో ఉంచాలని లోక్సభలో ప్రస్తావించానన్నారు. పోస్ట్మార్టం నివేదికలు కూడా టైప్ చేసి ఇవ్వాలన్నారు. రాతపూర్వకంగా ఇచ్చే నివేదికలు ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.