అశోక్గజపతి రాజుకు వైసీపీ ఎంపీ సవాల్
ABN , First Publish Date - 2021-07-18T20:33:16+05:30 IST
అశోక్గజపతి రాజుకు వైసీపీ ఎంపీ సవాల్
విజయనగరం: మాన్సాస్ సంస్థ భూములన్నీ ప్రభుత్వానివే అని వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. 45 ఏళ్ల క్రితమే మాన్సాస్ భూములన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పాలని విజయనగరం జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదని, మాన్సాస్ సంస్థ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయరాదని.. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉందని కోర్టు తీర్పులో ఉందని ఎంపీ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ కొన్ని భూముల అమ్మకాలు జరిగాయని ఎంపీ చంద్రశేఖర్ వెల్లడించారు. బహిరంగ ప్రజా వేదికకు అశోక్గజపతి రాజు సిద్ధమా? అని ఎంపీ చంద్రశేఖర్ ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున వచ్చేందుకు తాను సిద్ధమని ఎంపీ చంద్రశేఖర్ ప్రకటించారు.