ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ
ABN , First Publish Date - 2021-05-09T01:52:07+05:30 IST
ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ
కృష్ణా: ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. ఆక్సిజన్, రెమ్డిసివర్పై జీఎస్టీ తగ్గింపు నిర్ణయంపై బాలశౌరి స్పందించారు. వీటన్నింటినీ సున్నా శాతం స్లాబుల్లోకి తీసుకురావాలని బాలశౌరి కోరారు. తగ్గింపు రేట్లను కరోనా పూర్తిగా పోయేవరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్లపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా తొలగించాలని అభ్యర్థించారు. అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టాలని కోరారు.