చంద్రయ్య హత్యతో వైసీపీకి సంబంధం లేదు: పిన్నెల్లి

ABN , First Publish Date - 2022-01-13T21:54:26+05:30 IST

టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యతో వైసీపీకి సంబంధం లేదని మంగళగిరి

చంద్రయ్య హత్యతో వైసీపీకి సంబంధం లేదు: పిన్నెల్లి

గుంటూరు: టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యతో వైసీపీకి సంబంధం లేదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య కక్షలే హత్యకు దారితీశాయని ఆయన పేర్కొన్నారు.తానెప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సాహించలేదని ఆయన స్పష్టం చేశారు. నిందితులు ఎవరైనా వారిని చట్టప్రకారం శిక్షించాలని ఆయన కోరారు. 


జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిదే. చంద్రయ్య గ్రామ సెంటర్‌లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. 


Updated Date - 2022-01-13T21:54:26+05:30 IST