YCP MLA జొన్నల గడ్డ పద్మావతి దౌర్జన్యం..రైతన్న పంట నాశనం..!

ABN , First Publish Date - 2021-10-23T17:31:23+05:30 IST

శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి భూ ఆక్రమణ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. శింగనమల నియోజకవర్గంలోని కొర్రపాడు గ్రామంలో నాగలింగారెడ్డి అనే రైతు పంట పోలాన్ని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే పద్మావతి

YCP MLA జొన్నల గడ్డ పద్మావతి దౌర్జన్యం..రైతన్న పంట నాశనం..!

అనంతపురం: శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి భూ ఆక్రమణ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. శింగనమల నియోజకవర్గంలోని కొర్రపాడు గ్రామంలో నాగలింగారెడ్డి అనే రైతు పంట పొలాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆక్రమిస్తున్నారనే వీడియోతో పాటు పంట పొలంలో రైతులపై దౌర్జన్యం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.


వివరాల్లోకి వెళ్తే.. కొర్రపాడు పక్కన ఉన్న హైవేపై రైతు నాగలింగారెడ్డికి పొలం ఉంది. అయితే దాని పక్కనే ఇటీవల జొన్నల గడ్డ పద్మావతి కుటుంబీకులు ఐదు ఎకరాల పొలం తీసుకున్నట్లు సమాచారం. ఆ పొలానికి వెళ్లడానికి వేరే దారి ఉన్నప్పటికీ ప్రధాన రహదారి నుంచి రోడ్డు వేసుకోవాలనేది వారి ఆలోచన. ఎమ్మెల్యే పొలానికి దారి లేకపోవడంతో రైతు నాగలింగారెడ్డి పొలంపై కన్నేశారు. ఆ పొలం నుంచి దారి వేసుకోవడానికి రైతు వేసిన పచ్చటి వరి పైరును ట్రాక్టర్‎తో తొక్కించారు. దీంతో తమ పొలాన్ని ట్రాక్టర్‎తో తొక్కించారంటూ రైతు నాగలింగా రెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తమను రక్షించాలంటూ వేడుకున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేకున్నా తమ భూముల నుంచి రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారంటూ రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-23T17:31:23+05:30 IST